UPDATED 18th OCTOBER 2017 WEDNESDAY 6:00 PM
అమరావతి : దీపావళి పర్వదినాన్ని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఆయన ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు ప్రతీకగా నిలిచిన దీపావళి పర్వదినాన్ని ఆనందంగా జరుపుకుంటామని, ఈ పండుగ ప్రజల్లో ఆనందమయి కాంతులు అందించాలని ఆయన పేర్కొన్నారు. చెడుపై విజయంగా సంబరాలతో దీపాలు వెలిగిస్తామని, ఇదే స్పూర్తితో శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యం వెల్లివిరిసేలా స్వర్ణాంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో తెలుగు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.







