UPDATED 9th MARCH 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో పిడబ్యుడి కాలువపై అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని వాటిని వెంటనే తొలగించాలని మాజీ ఎంపిపి మేడిశెట్టి వీరభద్రం డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్నవారికి కాకుండా వేరే వారికి ఇళ్ళ నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం అన్యాయం అన్యాయమని, అక్రమ కట్టడాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంతంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మేడిశెట్టి వెంకట రమణ, బోడే శ్రీను, గుత్తుల కృష్ణార్జునరావు, విత్తనాల భాను, పిల్లి పురుషోత్తంశెట్టి, మందపల్లి సురేష్, కొప్పిశెట్టి శ్రీను, గుత్తుల చిన్నబాబు, పెదవెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.







