గంగవరం:5 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరూ పోస్టుకార్డు ఉద్యమంలో పాల్గొనాలని రంపచోడవరం జిల్లా సాధన సమితి కన్వీనర్ బాలు అక్కి సాకో కన్వీనర్ సీతంశెట్టి రత్తి శనివారం పిలుపునిచ్చారు. రంపచోడవరం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గంగవరంలో జిల్లా ఏర్పాటు ఆవశ్యకతపై పోస్ట్ కార్డ్ ఉద్యమంపై యువతకు అవగాహన కల్పించారు. జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరుకు పోస్ట్ కార్డు ద్వారా అభిప్రాయాలను తెలియజేయాలన్నారు. అరకు కేంద్రంగా జిల్లా ఏర్పాటు అయినట్లయితే రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని రంపచోడవరం, చింతూరు డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. సుమారు నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించి జిల్లా కేంద్రం చేరుకోవాల్సి ఉంటుందని దాని కంటే రాష్ట్ర రాజధానికి చేరుకోవడం సులువుగా ఉంటుంది అన్నారు. రంపచోడవరం నియోజకవర్గం నుంచి అరకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం కూడా లేదని అన్నారు. ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు పూర్తి చేసిన తర్వాత ఉద్యమాలు చేస్తే ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. ముందస్తుగానే ప్రజలు తమ అభిప్రాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, ఇందుకోసం రంపచోడవరం జిల్లా సాధన సమితి గ్రామ స్థాయి నుంచి ప్రజలను చైతన్య పరిచేందుకు కృషి చేసిందని అన్నారు. జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు. ఈకార్యక్రమంలో సమితి సభ్యులు మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, సిద్ధూ,శివ, వెంకటేశ్వర్లు, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







