15వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు

గంగవరం (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఏటిపల్లి ఆశ కార్యకర్త ముర్ల చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 15వ రోజుకు చేరుకున్నాయి. ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ పోరాటం ఆపేదిలేదని ఇటీవల మృతి చెందిన ఐదుగురు ఆశా కార్యకర్తల కుటుంబాలను ఆదుకునే వరకు పోరాటం ఆగదని సీఐటీయూ నాయకులు చెల్లయమ్మ, రమణమ్మ తెలిపారు. ప్రభుత్వం ఐటీడీఏ అధికారులు తక్షణమే స్పందించి మృతిచెందిన ఆశా కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us