Dwaraka Tirumala: కనుల పండువగా శ్రీవారి కోవెల ఉత్సవం

ద్వారకాతిరుమల (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం కోవెల ఉత్సవం కనుల పండువగా నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా ఏటా స్వామివారు ఉభయదేవేరులతో కలిసి గ్రామంలో ఊరేగేవారు. కరోనా కారణంగా గతేడాది నుంచి తిరువీధి సేవలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయంలో నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను తొళక్కం వాహనంపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కోవెల ఉత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us