UPDATED 29th MARCH 2018 THURSDAY 10:00 PM
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో జిల్లాలోని ఐదవ బ్యాచ్ మహిళా సంఘాల ప్రతినిధులకు మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం గురువారంతో ముగిసింది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు, బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.ఎస్. మూర్తి, ఫ్యాకల్టీలు జె. రాంబాబు, కుమారరాజు, గోపాలరావు, ఎస్.కె. మోహిత్, మహిళా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.







