లాహోర్ (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: మరోసారి బాంబు పేలుడు కలకలం రేపుతోంది. లాహోర్ లోని లహరీ గేట్ వద్ద భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా, మరో 20 మందికి గాయాలు అయ్యాయి. అనార్కలీ బజార్ లో బాంబు పేలుడు సంభవించింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు ప్రాంతాన్ని అక్కడి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పేలుడు ఘటనపై విచారణ జరుపుతున్నామని లాహోర్ డీఐజీ పేర్కొన్నారు. ఐఈడీ పేలుడా? టైమ్ బాంబా అనే దానిపై ప్రస్తుతం విచారణ మొదలుపెట్టినట్లుగా తెలిపారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







