UPDATED 26th AUGUST 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మున్సిపాలిటీలో పనిచేస్తున్న మెప్మా సిబ్బందికి వేతనాలు పెంచినందుకు ఆయనకు కృజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఆదివారం మెప్మా సిబ్బంది కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మెప్మా సిబ్బందిని కమీషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో టి.ఇ సుధాకర్, పివోలు వెంకటలక్ష్మి, శైలజ, సుధారాణి, ఆర్పీలు, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.







