గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి. ప్రభాకర్ వర్మ కోరారు. మండలంలోని కొత్తడలో యుటిఎఫ్ మండలశాఖ మహాసభ మండల శాఖ అధ్యక్షుడు రఘుబాబు దొర అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యాశాఖలో వస్తున్న అనూహ్య పరిణామాలు పరిస్థితులను ప్రతి ఒక ఉపాధ్యాయుడు గమనించాలని భవిష్యత్తులో ఉపాధ్యాయులు మనుగడ నియామకాలు వంటివి క్లిష్టతరం అయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లా కార్యదర్శి సాయిరాం మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధన చేస్తూనే న్యాయబద్ధంగా రావలసిన పీ.ఆర్.సీ డీఏ కోసం పోరాటనికి సిద్ధం అవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె. కృష్ణ గౌరవ అధ్యక్షుడు రాంబాబు, యుటిఎఫ్ నాయకులు చిన్నబాబు, నాగమణి రుక్మిణి దేవి, లక్ష్మి తదితరులు ఉన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







