బోధనేతర పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి. ప్రభాకర్ వర్మ కోరారు. మండలంలోని కొత్తడలో యుటిఎఫ్ మండలశాఖ మహాసభ మండల శాఖ అధ్యక్షుడు రఘుబాబు దొర అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ వర్మ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యాశాఖలో వస్తున్న అనూహ్య పరిణామాలు పరిస్థితులను ప్రతి ఒక ఉపాధ్యాయుడు గమనించాలని భవిష్యత్తులో ఉపాధ్యాయులు మనుగడ నియామకాలు వంటివి క్లిష్టతరం అయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లా కార్యదర్శి సాయిరాం మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధన చేస్తూనే న్యాయబద్ధంగా రావలసిన పీ.ఆర్.సీ డీఏ కోసం పోరాటనికి సిద్ధం అవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె. కృష్ణ గౌరవ అధ్యక్షుడు రాంబాబు, యుటిఎఫ్ నాయకులు చిన్నబాబు, నాగమణి రుక్మిణి దేవి, లక్ష్మి తదితరులు ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us