దేశంలో మరో ఒమిక్రాన్‌ కేసు.. ఎక్కడంటే?

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా దిల్లీలో మరో కేసు నిర్ధారణ అయ్యింది. టాంజానియా నుంచి ఇటీవల భారత్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు గుర్తించారు. ఇంతకుముందు కర్ణాటకలో ఇద్దరు వ్యక్తులకు క్తొత వేరియంట్‌ సోకిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు దక్షిణాఫ్రికా దేశస్థుడు కాగా, మరొకరు స్థానిక ప్రభుత్వ వైద్యుడు. కాగా.. శనివారం మరో ఇద్దరికి ఒమిక్రాన్‌ సోకింది గుర్తించారు. వీరిలో ఒకరు గుజరాత్‌కు, మరొకరు మహారాష్ట్రకు చెందినవారు. దీంతో కరోనా కొత్త వేరియంట్‌ కేసులు ఇప్పటి వరకు ఐదుకు చేరాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us