రెడ్ బీ న్యూస్, 31 డిసెంబర్ 2021: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిప్ల కొరతను తట్టుకొని ఎట్టకేలకు ఓలా తొలిబ్యాచ్ ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను పూర్తిచేసింది. ఇప్పటికే వీటిపై సుదర్ఘమైన వెయిటింగ్ పిరియడ్ ఉంది. ఈ విషయాన్ని ఓలా స్కూటర్స్ సీఈవో భవేష్ అగర్వాల్ ఒక ట్వీట్లో తెలిపారు. ‘‘మా వాహనాలు కొనుగోలు చేసిన వారికి డెలివరీలను పూర్తి చేశాం. కొన్ని మార్గం మధ్యలో ఉన్నాయి. చాలా వరకు డెలివరీ సెంటర్ల వద్ద ఉన్నాయి. ఆర్టీవో రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత వినియోగదారులకు చేరనున్నాయి. అందరికీ డిజిటల్ విధానం కొత్త కావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనుకున్న దానికంటే మందకొడిగా జరుగుతోంది’’ అని అగర్వాల్ వెల్లడించారు. ఓలా డిసెంబర్ 15 నుంచి ఎస్1, ఎస్1 ప్రో డెలివరీలను మొదలుపెట్టింది. దీంతోపాటు తొలి 100 మంది కస్టమర్ల కోసం బెంగళూరు, చైనా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అరుణ్ శ్రీదేశ్ముఖ్ ఇటీవల మాట్లాడుతూ ‘‘మాకు కస్టమర్లే అత్యంత ముఖ్యం. అన్ని చోట్ల నుంచి సానుకూల ఫీడ్బ్యాక్ లభించింది. చాలామంది వినియోగదారులు రవాణాకు సంబంధించిన సమస్యలను మా దృష్టికి తెచ్చారు. మేం ఆ సమస్యను వేగంగా పరిష్కరించాం’’ అని పేర్కొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







