UPDATED 30th JULY 2019 TUESDAY 8:00 PM
పెద్దాపురం: భక్తుల కొంగు బంగారంలా విరాజిల్లుతున్న పెద్దాపురం పట్టణంలో గల ప్రసిద్ధ మరిడమ్మ అమ్మవారి దేవాలయంలో ఆషాఢమాసం సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం వేద పండితులు చిట్టెం హరిగోపాలశర్మ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి పూజా సామగ్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.







