మద్దతు ధరకే ధాన్యం సేకరణ

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 30 ఆక్టోబర్ 2021: ఖరీఫ్‌ సీజన్‌లో 1,018 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులు, సిబ్బందికి శిక్షణిచ్చారు. దళారుల ప్రమేయం లేకుండా, రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకే ఈ దఫా ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. కళ్లాల నుంచే సీఎంఆర్‌కు ట్యాగింగ్‌ చేసిన రైస్‌ మిల్లులకు ధాన్యాన్ని తరలించాలన్నారు. జేసీ కీర్తి, సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా, ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య, వెంకటరమణ, ఆర్డీవోలు చిన్నికృష్ణ, వసంతరాయుడు, సింధుసుబ్రహ్మణ్యం, పౌరసరఫరాల సంస్థడీఎం లక్ష్మిరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్‌, డీఎస్‌వో ప్రసాదరావు, డీఆర్‌డీఏ పీడీ శ్రీరమణి, లీగల్‌ మెట్రాలజీ డీసీ మాధురి పాల్గొన్నారు
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us