విద్యార్థులకు పెన్నులు పంపిణి

UPDATED 7th MARCH 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు దవులూరి ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం పరీక్షా మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధినేత దవులూరి సుబ్బారావు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఉన్న 33  ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా మెటీరియల్ అందచేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల విటికర్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్ లు, పెన్నులు, రబ్బర్లు, అందచేశారు. ఈ కార్యక్రమంలో బొండు నూకరాజు, పోలిశెట్టి రాజేష్, మడగల శ్యాం కుమార్, గోకాడ రాజా, కీర్తి ఆర్య తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us