తిరుపతి (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021 : ఈనెల 17న తిరుపతిలో నిర్వహించతలపెట్టిన అమరావతి పరిరక్షణ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని సమితి నాయకులు ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండ్తో అమరావతి న్యాయస్థానం నుంచి తిరుపతి దేవస్థానం వరకు సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నామని లేఖలో ఎస్పీకి తెలియజేశారు. 17వ తేదీన పాదయాత్ర తిరుపతికి చేరుకుంటుందని, అదేరోజున తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించుకునేందుకు అనుమతి మంజూరుచేసి సహకరించాలని సమితి ప్రఽధాన కార్యదర్శి తిరుపతిరావు అభ్యర్థించారు. శాంతి భద్రతలకు ఆటంకం లేకుండా, కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ సభను నిర్వహించుకుంటామని హామీ ఇస్తూ అనుమతిని కోరారు. బహిరంగ సభకు సంబంధించిన పూర్తివివరాలు అందించాలని ఎస్పీ సమితి నాయకులను కోరారు. వారినుంచి సమాచారం అందిన తర్వాత అనుమతిపై నిర్ణయం తీసుకోనున్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







