ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు

UPDATED 24th APRIL 2018 TUESDAY 7:00 PM

సామర్లకోట: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని గ్రామ టిడిపి నాయకుడు చల్లా బుజ్జి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని విరివిగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం గ్రామస్థులు మజ్జిగ పంపిణీ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us