గంగవరం (రెడ్ బీ న్యూస్) 9 నవంబర్ 2021: మండలంలో నాటుసారా తయారీ విక్రయాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గంగవరం ఎస్ఐ షరీఫ్ కోరారు. మండల సరిహద్దు గ్రామాల్లో ఏలేరు ప్రాజెక్టు పరిసరాల్లో నిర్వహిస్తున్న నాటుసారా బట్టీలను మంగళవారం ధ్వంసం చేశారు. ఏలేరు ప్రాజెక్టులో నాటు పడవలపై ప్రయాణించి దట్టమైన అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు నాలుగు వేల లీటర్ల బెల్లపు ఊటను, నాటుసారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములను ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రమణ, వీరబాబు తదితరులు ఉన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







