నాలుగు వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

గంగవరం (రెడ్ బీ న్యూస్) 9  నవంబర్ 2021: మండలంలో నాటుసారా తయారీ విక్రయాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గంగవరం ఎస్ఐ షరీఫ్ కోరారు. మండల సరిహద్దు గ్రామాల్లో ఏలేరు ప్రాజెక్టు పరిసరాల్లో నిర్వహిస్తున్న నాటుసారా బట్టీలను మంగళవారం ధ్వంసం చేశారు. ఏలేరు ప్రాజెక్టులో నాటు పడవలపై ప్రయాణించి దట్టమైన అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు నాలుగు వేల లీటర్ల బెల్లపు ఊటను, నాటుసారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములను ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రమణ, వీరబాబు తదితరులు ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us