UPDATED 24th AUGUST 2022 WEDNESDAY 8:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): స్థానిక రామారావుపేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఈనెల 26 నుంచి 28 వరకు మూడురోజులపాటు రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించనున్నట్లు పాఠశాల డైరెక్టర్ సిహెచ్. విజయ్ ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ జిల్లా టేబుల్ టెన్నీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్నఈ పోటీలలో జూనియర్ అండర్-19, అండర్-17, సబ్ జూనియర్ అండర్-15, కేడెట్స్ అండర్-13, హోప్స్ అండర్-11, మెన్ అండ్ ఉమెన్ విభాగాలలో క్రీడాకారులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.







