సామర్లకోట, 24 మే 2020 (రెడ్ బీ న్యూస్) : సామర్లకోట మున్సిపాలిటీని గ్రీన్ జోన్ గా మార్పు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు రెడ్ జోన్ గా ఉన్న పట్టణాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారు. గత నెల ఏప్రిల్ 23న కోలావారి వీధిలో ఒక కరోనా కేసు బయటపడింది. ఆ కుటుంబంలోని వారికి పరీక్షలు
నిర్వహించగా మరో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో అప్పటినుంచి మున్సి పాలిటీ పరిధిలోని 4, 5, 6, 7, 15, 16 వార్డులను రెడ్
జోన్లుగా ప్రకటించి, ఆయా
వార్డులకు పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. పాజిటివ్ కేసులు వచ్చిన వారు చికిత్స తరువాత ఆరోగ్యంగా ఇళ్లకు చేరుకు
న్నారు. రెడ్ జోన్లోని ప్రాంతాల ప్రజలు సుమారు నెల రోజుల పాటు నిబంధనలు పాటించవలసి వచ్చింది. ఆ ప్రాంతంలో ఆదివారం రెడ్
జోన్ ఉపసంహరించడంతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







