UPDATED 10th JUNE 2018 SUNDAY 10:00 PM
రాజానగరం: గైట్ కళాశాల ప్రాంగణంలో వేంచేసివున్న షిరిడీ సాయిబాబా వారి ఆలయ ఏడవ వార్షిక మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా వారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. చైతన్య విద్యా సంస్థల అధినేత్రి కలిదిండి బదరీలక్ష్మి బాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.







