UPDATED 6th DECEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యా స్వర్ణోత్సవాల వేడుకల్లో భాగంగా దేశ, విదేశాలకు చెందిన వివిధ నాణాలు, కరెన్సీ నోట్లు ప్రదర్శన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఐ. శారద మాట్లాడుతూ 1835 నుంచి 2018 వరకు దేశ, విదేశాలకు చెందిన నాణాలు, కరెన్సీ నోట్లను ప్రదర్శించడం జరిగిందని అన్నారు. ఈ ప్రదర్శనను కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు మాత్రమే కాకుండా పట్టణంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్, ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు తిలకించారు.







