అగ్ని బాధిత కుటుంబానికి టీడీపీ పరామర్శ

గంగవరం (రెడ్ బీ న్యూస్) 30 అక్టోబర్ 2021 : ఇటీవల గంగవరం మండలం లాక్కొండ గ్రామంలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని మండల టీడీపీ పార్టీ నాయకులు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం, కూరగాయలు అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన అన్ని రాయితీలు, సహాయాలు అందించేందుకు పార్టీ తరఫునుండి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు డాక్టర్ తీగల ప్రభ, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కోసు బుల్లెమ్మ, మండల కమిటీ ప్రధాన కార్యదర్శి దుమ్ముల భాను ప్రకాష్, మాజీ కో ఆప్షన్ సభ్యులు కొమ్మన చిన్న రావు, లక్కొండ సర్పంచ్ ఒండాపు ప్రతాప్ రెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షుడు మద్దిటి వీరభద్రారెడ్డి, సీనియర్ నాయకులు మల్లేశ్వరరావు, సోమరాజు, చిరంజీవి, పామర్తి వీరబాబు, సత్యవతి, కృష్ణ, శ్రీను, సారపు. బాలమ్మ, సింహాద్రి. రాంబాబు, అప్పారావు కార్యకర్తలు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us