UPDATED 12th MARCH 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తాయి. తహసీల్దార్ ఎల్. శివకుమార్, ఈవోపీఆర్డీ జగ్గారావు అధ్యక్షతన నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సుమారు 25 ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సర్వే నిమిత్తం 13 మంది దరఖాస్తులు, ఉపాధి హామీ రెండు, పింఛన్ల కోసం నాలుగు, ఎన్టీఆర్ గృహాల కోసం మూడు, కొత్త రేషన్ కార్డుల కోసం మూడు, తదితర అర్జీలు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో నాగేశ్వరరావు, ఎంఎవో శ్యామూల్ జాన్, వెలుగు ఎపిఎం జగదీశ్వరి, ఎంఈవో వెంకటరమణమ్మ, విఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.







