UPDATED 25th SEPTEMBER 2019 WEDNESDAY 9:00
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): స్వయం సహాయ సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులు, సరుకులను స్థానిక బుధవారం సంతలో మెప్మా బజార్ ద్వారా విక్రయించారు. మెప్మా సిఎంఎం కె. మోహనరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దుకాణాల్లో సామర్లకోట పట్టణంలో డ్వాక్రా సంఘాలలో 17 వ్యక్తిగత యూనిట్లకు సంబంధించిన సభ్యులు తయారు చేసిన వస్తువులును విక్రయించారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిఈవోలు సుజాత, చంద్రశేఖర్, ఎంఇసిసిలు సంధ్య, సత్యవేణి, హెచ్ఆర్పీలు కాసులు, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.







