UPDATED 5th JUNE 2017 MONDAY 9:00 PM
కాకినాడ : జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా జి.వి. ప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నాగమల్లి తోట జంక్షన్ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోగల సంస్థ కార్యాలయంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఇన్ఛార్జి పిడి గా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ -2 రాధాకృష్ణమూర్తి నుంచి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. తొలుత జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం ప్రజాదర్బార్లో పాల్గొన్నారు. ఈయన విశాఖ జిల్లాలో పిడి గా పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వచ్చారు.








