విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: వచ్చే ఏడాది భారత్లో జరిగే బహుళ జాతీయ నౌకాదళ విన్యాసాలు ‘మిలాన్-2022’కు సంబంధించిన వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు తూర్పునావికాదళ(ఈఎన్సీ) వర్గాలు మంగళవారం తెలిపాయి. కార్యక్రమానికి ఈఎన్సీకి చెందిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ సంజయ్సాదు పాల్గొని మాట్లాడారు. కమాండ్ ముఖ్య కార్యాలయం(విశాఖ)లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4వ తేదీ వరకు విన్యాసాలు కొనసాగుతాయని, మొత్తం 45 దేశాలు పాల్గొంటాయన్నారు. విన్యాసాల్లో భాగంగా అంతర్జాతీయ మారిటైం సదస్సులు, నిపుణుల విషయ పరిజ్ఞానం బదిలీ, నమూనాల ప్రదర్శన, తదితర కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







