UPDATED 28th MARCH 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతుల పొలాల వద్దకు వెళ్లి ధాన్యం తేమ శాతం గుర్తించాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఎఎం దత్తాత్రేయ అన్నారు. స్థానిక టిటిడిసిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ విజయరాజు, పెద్దాపురం ఎ.ఎస్.వో కె.వి. పురుషోత్తం కుమార్, డివిజనల్ కో- ఆపరేటివ్ ఆఫీసర్ రాధాకృష్ణ, వివిధ మండలాల సొసైటీ సిబ్బంది, వెలుగు, మహిళా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.







