UPDATED 11th MAY 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: శ్రీ కల్కి మానవ సేవా సమితి భగవాన్ శిష్యురాలైన చిన్మయి దాసాజి, వేమగిరికి చెందిన పరమహంస యోగానంద నేత్రాలయ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ సుష్మమోహిని శుక్రవారం తెలిపారు. ఈ శిబిరానికి హాజరైన సుమారు వెయ్యి మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కళ్లజోళ్లు, అలాగే బియ్యం, పాదరక్షలు, ఆహారపదార్దాలు అందచేసినట్లు కౌన్సిలర్ తెలిపారు.







