జేఎన్టీయూకే వీసీగా బాధ్యతలు స్వీకరించిన ప్రసాదరాజు

కాకినాడ (రెడ్ బీ న్యూస్) 31 అక్టోబర్ 2021: కాకినాడ జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతిగా ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు ఆదివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూకేను ఆదర్శవంతమైన సాంకేతిక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సహకారంతో విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రసాద రాజుకు రిజిసా్ట్రర్‌ ఎల్‌.సుమలత, ఓఎస్డీ రవీంద్రనాథ్‌, డైరెక్టర్లు ప్రొఫెసర్‌ సీహెచ్‌ సాయిబాబు, వి.రవీంద్ర, ప్రిన్సిపాల్‌ బాలకృష్ణ, వర్శిటీ అనుబంధ కళాశాలల మేనేజ్‌మెంట్లు, అధ్యాపక, అధ్యాపకేతర, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది అభినందనలు తెలిపారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us