గంగవరం (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021: మండలంలోని కొమరవరం అంగన్వాడీ కేంద్రం లోని పిల్లలకు అవేర్ ఫౌండేషన్ సమకూర్చిన గ్లాసులు కంచాలను మరిపాలెం సర్పంచ్ మడకం వెంకటేశ్వర్లు మంగళవారం పంపిణీ చేశారు. అవేర్ ఫౌండేషన్ గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల వల్ల గిరిజనులు లబ్ధి పొందుతున్నారని, వారి సేవలు మరువలేనివన్నారు. అవేర్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏజెన్సీలో సమస్యల పరిష్కారానికి తమ సంస్థ ఛైర్మన్ జి. మాధవన్ తనవంతు కృషి చేస్తున్నారన్నారు.ఈ ప్రాంతాల్లో ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్న త్రాగునీటి సమస్య పరిష్కారానికి సుమారు 15 హ్యాండ్ బోర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే గిరి జిల్లా ఆర్థిక అభివృద్ధి కోసం స్వయం ఉపాధి కల్పన క్రింద గిరిజనులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రామయ్యమ్మ, అక్కమ్మ అవేర్ ప్రతినిధి ప్రసన్న తదితరులు ఉన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







