పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 11 నవంబర్ 2021:
పెద్దాపురం - సామర్లకోట ఏడిబి రోడ్డులోని రాక్ సిరామిక్ పరిశ్రమలో కార్మికుల అక్రమ తొలగింపు, బదిలీలు ఆపాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు గురువారం ఆందోళన చేపట్టారు. తమను పరిశ్రమ యాజమాన్యం చర్చల పేరుతో పిలిచి రాజీనామా పత్రాలపై సంతకాలు చెయ్యాలని తీవ్రఒత్తిడి చేస్తున్నారని కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో దారపురెడ్డి క్రాంతికుమార్, నీలపాల సూరిబాబు, సిరిపురపు శ్రీనివాస్, చింతల సత్యనారాయణ తదితర పాల్గొన్నారు.







