గంగవరం (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022: మరణించిన ఆశ వర్కర్ల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన ఆశ వర్కర్ల దీక్ష విరమించాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వంశీకృష్ణ కోరారు. ఆశా వర్కర్లు గంగవరంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మంగళవారానికి ఇరవై రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ సందర్శించి ఆశా వర్కర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరణించిన ఆశా వర్కర్ల కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం, మెడికల్ ఆఫీసర్ లపై చర్యలు తీసుకునే వరకు దీక్ష విరమించేది లేదని వారు తేల్చి చెప్పడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







