ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బెడ్ బహుకరణ

గంగవరం: 9 సెప్టెంబర్ 2020 (రెడ్ బీ న్యూస్): ఇటీవల అకాల మరణం పొందిన మొల్లేరు సొసైటీ మాజీ సీఈవో బుర్రి రాంబాబు జ్ఞాపకార్థం ఆయన భార్య అన్నపూర్ణ పిడత మామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలపై దృష్టి సారించారు.ఈ మేరకు రోగులు సౌకర్యార్థం ఒక బెడ్ ను బహూకరించారు. బుధవారం ఆ బెడ్ ను పీహెచ్సీ స్థల దాత డీసీసీబీ మాజీ డైరెక్టర్ వై. వెంకటేశ్వరరావు, రాంబాబు కుటుంబ సభ్యులు ఆరోగ్య కేంద్రంలో అందజేశారు. ఆరోగ్య కేంద్రానికి బెడ్ బహుకరణ పట్ల వైద్యాధికారి రమాదేవి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూ. రామకృష్ణ ఏనుగు శివాజీ, వర్రి నాగేశ్వరరావు, తుమ్మల చిట్టి బాబు హెల్త్ సూపర్ వైజర్లు రాజబాబు చల్లా రావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us