గంగవరం: 9 సెప్టెంబర్ 2020 (రెడ్ బీ న్యూస్): ఇటీవల అకాల మరణం పొందిన మొల్లేరు సొసైటీ మాజీ సీఈవో బుర్రి రాంబాబు జ్ఞాపకార్థం ఆయన భార్య అన్నపూర్ణ పిడత మామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలపై దృష్టి సారించారు.ఈ మేరకు రోగులు సౌకర్యార్థం ఒక బెడ్ ను బహూకరించారు. బుధవారం ఆ బెడ్ ను పీహెచ్సీ స్థల దాత డీసీసీబీ మాజీ డైరెక్టర్ వై. వెంకటేశ్వరరావు, రాంబాబు కుటుంబ సభ్యులు ఆరోగ్య కేంద్రంలో అందజేశారు. ఆరోగ్య కేంద్రానికి బెడ్ బహుకరణ పట్ల వైద్యాధికారి రమాదేవి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూ. రామకృష్ణ ఏనుగు శివాజీ, వర్రి నాగేశ్వరరావు, తుమ్మల చిట్టి బాబు హెల్త్ సూపర్ వైజర్లు రాజబాబు చల్లా రావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







