గంగవరం (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: గంగవరం గ్రామశివారులో 193 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు. అడ్డతీగల నుంచి గంగవరం వైపు వచ్చే గంగవరం గ్రామ శివారులో ముందుగా వచ్చిన సమాచారంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ-31 ET 4911 ఇన్నోవా వాహనాన్ని పోలీసులను చూసి దూరంగా నిలిపివేసి అందులో వ్యక్తులు పరారయ్యారు. గంగవరం తహశీల్దార్ శ్రీమన్నారాయణ సమక్షంలో కారును తనిఖీ చేయగా 8 బస్తాల్లో 193 కిలోల గంజాయి లభించింది. దీని విలువ రూ. 3 లక్షల 86 వేలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. నిందితులకోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఏఎస్ఐ రజాక్, వీఆర్వో అప్పలకొండ పోలీస్ సిబ్బంది వీరబాబు, రమణ ఉన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







