సత్యదేవుని ప్రత్యేక దర్శనభాగ్యం నేడు

అన్నవరం (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: అన్నవరం సత్యదేవుడికి పంచామృతాభిషేకాలు జరుగుతుండగానే భక్తులు క్యూలైన్ల ద్వారా శనివారం వేకువనే స్వామిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. సత్యదేవుని జన్మనక్షత్రం సందర్భంగా శనివారం తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాతం, 2 గంటలకు మహన్యాసం జరుగుతుంది. అనంతరం 3 గంటల నుంచి 4.30 వరకు స్వామి, అమ్మవార్ల మూలవిరాట్టుకు పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. సాధారణంగా అభిషేకం సమయంలో ప్రత్యేక టికెట్లు పొందిన వారికి మినహా సాధారణ భక్తులను అనుమతించరు. సత్యదీక్షల విరమణ, రద్దీ నేపథ్యంలో తెల్లవారుజామున 3 నుంచి 4.30 గంటల వరకు స్వామికిఅభిషేకం జరుగుతుండగానే క్యూలైన్లలో(అంతరాలయం బయట నుంచి) భక్తులు దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వనదుర్గ అమ్మవారి ఆలయంలోచండీహోమం నిర్వహించారు. 3,333 వ్రతాలు జరిగాయి. రూ.33.56 లక్షల ఆదాయం సమకూరింది

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us