మృతుల కుటుంబాలకు టిడిపి నాయకుల పరామర్శ

గంగవరం (రెడ్ బీ న్యూస్) 17 నవంబర్ 2021: ఇటీవల రంపచోడవరం మండలం పోలవరం కాలువ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండలానికి చెందిన జియ్యంపాలెం టీడీపీ గ్రామకమిటీ ప్రధాన కార్యదర్శి సోర్లం నాగ వెంకట దుర్గాప్రసాద్ దొర, జోడి రాజుబాబు కుటుంబ సభ్యులను టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున ఆధ్వర్యంలో నాయకులు బుధవారం పరామర్శించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. మృతుల కుటుంబాలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆమదాలబంధ ఎంపీటీసీ సభ్యుడు పండ ఆదినారాయణ దొర, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి కమ్మరి రాంబాబు, భాను ప్రకాష్, వీరబాబు బాలకృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us