Tiger: ఆ 'సూపర్ మామ్ టైగర్' మృతికి సీఎం, కేంద్రమంత్రి నివాళి

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : మధ్యప్రదేశ్ లోని పెంచ్ టైగర్ రిజర్వ్ లో లెజెండరీ ఆడ పులి 'కొల్లారావాలి' మృతి పట్ల కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ స్పందించారు. 29 పులులకు జన్మనిచ్చిన ఈ 'పెంచ్ టైగర్ రిజర్వ్ క్వీన్' మరణం తీరని లోటుగా అభివర్ణించారు. సూపర్ మామ్ గా పిలవబడే 'కొల్లారావాలి' మన దేశంలో పులుల జనాభాను పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడంలో చేసిన మేలు ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ ఆయన ట్విట్ చేశారు. మరోవైపు, ఈ పులి మరణించిన విషయం తెలిసి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా నివాళులర్పించారు. మధ్యప్రదేశ్ 'టైగర్ స్టేట్ హోదా సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ పులి తమ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఈ 'పెంచ్ టైగర్ రిజర్వ్ క్వీన్' పిల్లల గర్జనతో మధ్యప్రదేశ్ అడవులు ఎప్పుడూ ప్రతిధ్వనిస్తాయని పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us