ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : మధ్యప్రదేశ్ లోని పెంచ్ టైగర్ రిజర్వ్ లో లెజెండరీ ఆడ పులి 'కొల్లారావాలి' మృతి పట్ల కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ స్పందించారు. 29 పులులకు జన్మనిచ్చిన ఈ 'పెంచ్ టైగర్ రిజర్వ్ క్వీన్' మరణం తీరని లోటుగా అభివర్ణించారు. సూపర్ మామ్ గా పిలవబడే 'కొల్లారావాలి' మన దేశంలో పులుల జనాభాను పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడంలో చేసిన మేలు ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ ఆయన ట్విట్ చేశారు. మరోవైపు, ఈ పులి మరణించిన విషయం తెలిసి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా నివాళులర్పించారు. మధ్యప్రదేశ్ 'టైగర్ స్టేట్ హోదా సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ పులి తమ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఈ 'పెంచ్ టైగర్ రిజర్వ్ క్వీన్' పిల్లల గర్జనతో మధ్యప్రదేశ్ అడవులు ఎప్పుడూ ప్రతిధ్వనిస్తాయని పేర్కొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







