గోకవరం, 15 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): భద్రాచలం, ఒంటిమిట్టలలో వైభవోపేతంగా జరిగే సీతారాముల కల్యాణానికి కోరుకొండ శ్రీకృష్ణఛైౖతన్య సంఘం ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పిస్తుంటారు. గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలోని పొలంలో సోమవారం ప్రత్యేక పూజల మధ్య కోటితలంబ్రాల పంట సాగును ప్రారంభించారు. శ్రీరాముడు, హనుమంతుడు, అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వేషధారణలతో సీతారామలక్ష్మణుల విగ్రహాల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం రామ నామాన్ని జపిస్తూ నాగలితో పొలాన్ని దున్ని ఒడ్లు చల్లారు. శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవం నిర్వహించారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







