UPDATED 22nd FEBRUARY 2018 THURSDAY 6:30 PM
సామర్లకోట: సామాజిక సేవలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలోని భీమేశ్వర లయన్స్ క్లబ్ పలు సేవా కార్యక్రమాలను గురువారం చేపట్టింది. దీనిలో భాగంగా ప్రతి గురువారం నిరుపేద వృద్ధులకు వారి ఇంటి వద్దకే వెళ్లి భోజన సదుపాయం అందచేసే కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ గవర్నర్ వర్మ చేతుల మీదుగా ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మద్దిరాల శివకృష్ణ, లయన్ రెడ్డి, సేపేని సురేష్, కానుబోయిన విజయకృష్ణ, నల్లూరి కళ్యాణ్, ఈశ్వర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.







