సామర్లకోట, 27 సెప్టెంబరు 2020( రెడ్ బి న్యూస్):
సమాజానికి మంచి చేకూరే విధంగా కరోనా సమయంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న మీడియా ప్రతినిధులను అభినందించాలని భారత్ మాతా సేవా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ చాంబర్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గొరక పూడి చిన్నయ్య దొర అన్నారు. పట్టణంలో స్థానిక బళ్ల మార్కెట్ సెంటర్ వద్ద మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని డాక్టర్ చిన్నయ్య దొర ఆదివారం ప్రారంభించారు. ముందుగా ఇటీవల కరోనాతో రాష్ట్ర వ్యాప్తంగా మృతి చెందిన పాత్రికేయులు మీడియా మిత్రులకు విశ్వవిఖ్యాత గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి వారికి ఘన నివాళులు అర్పించారు.అనంతరం డాక్టర్ చిన్నయ్య దొర మాట్లాడుతూ పాత్రికేయుల సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా క్లబ్ కు ఫర్నీచర్ ను అందచేశారు.
స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కర్రి ఆదినారాయణ రెడ్డి పాత్రికేయులకు ఫేస్ షీల్డులు,మాస్కులను డాక్టర్ చిన్నయ్యదొర చేతుల మీదుగా అందజేశారు. క్లబ్ కార్యాలయానికి భవనాన్ని కేటాయించిన మున్సిపల్ కమిషనర్ ఏసుబాబుకు కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు అడపా వెంకట్రావు, కార్యదర్శి పోలిమాటి విజయకుమార్, కోశాధికారి అడపా శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి బిక్కిన వెంకట్, ఉపాధ్యక్షుడు కె.భాస్కర్ చౌదరి, గౌరవ అధ్యక్షులు అలమండ రంగనాథస్వామి, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







