UPDATED 29th JANUARY 2019 TUESDAY 5:00 PM
గండేపల్లి: రాజమహేంద్రవరం ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీప్రభుపాద జీవిత చరిత్రపై ఇస్కాన్ సంస్థ నిర్వహించిన జిల్లాస్థాయి పోటీ పరీక్షల్లో వివిధ కేటగిరీలలో గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన డి. ఈశ్వరి సాయిసంతోషి ఐదవ స్థానం సాధించింది. ఈ సందర్భంగా ఇస్కాన్ సంస్థ రూ. రెండు వేలు నగదు బహుమతితో పాటు మెరిట్ సర్టిఫికెట్, మెమెంటోను విద్యార్థినికి అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, విభాగాధిపతి రవికుమార్, లైబ్రేరియన్ వెంకటరమణ, ఎన్. సింహాచలం, కళాశాల సిబ్బంది, తదితరులు విద్యార్థినిని అభినందించారు.







