త్రివిక్రమరావుకు జాతీయ పురస్కారం

సామర్లకోట, 27 అక్టోబరు 2020 (రెడ్ బీ న్యూస్): ఆంధ్రప్రదేశ్ సర్వే ట్రైనింగ్ అకాడమీ సామర్లకోటలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న టి.త్రివిక్రమరావుకు జాతీయ పురస్కారం లభించింది. ఈమేరకు ఆయనను ఉత్తమ గెజిటెడ్ అధికారిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ అందింది. నవంబరు 1న విజయవాడలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. త్రివిక్రమరావు 232 మంది ఉప సర్వేయర్లకు, 9424 గ్రామ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జాతీయ పురస్కారానికి ఎంపికైన త్రివిక్రమరావును సర్వే అకాడమీ జాయింట్ డైరెక్టర్ సీహెచ్ వీఎస్ఎన్ కుమార్ తదితరులు అభినందించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us