UPDATED 16th MARCH 2018 FRIDAY 10:00 PM
సామర్లకోట: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఆరోపిస్తూ సిపిఐ ఎం.ఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు శుక్రవారం మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక స్టేషన్ సెంటర్ లో పార్టీ జిల్లా నాయకుడు వీరయ్య మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కమ్యూనిస్టు పార్టీ నాయకులపై దాడులు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.







