గంగవరం (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు, జాతీయ గణిత దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మండలంలోని వేములోవ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఆదివిష్ణు, గణిత ఉపాధ్యాయుడు చిన్నిబాబు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ జీవితంలో గణితం ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. గణితం ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తొలుత శ్రీనివాస్ రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ సీతారత్నం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







