ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు

గంగవరం (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు, జాతీయ గణిత దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మండలంలోని వేములోవ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఆదివిష్ణు, గణిత ఉపాధ్యాయుడు చిన్నిబాబు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ జీవితంలో గణితం ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. గణితం ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తొలుత శ్రీనివాస్ రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ సీతారత్నం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us