UPDATED 12th APRIL 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: ప్రభుత్వ పథకాలు పొందడానికి పల్స్ సర్వేలో ఉండాలనే నిబంధన మేరకు సర్వే చేయించుకోని వారి కోసం పట్టణ పరిధిలో ఐదు పల్స్ సర్వే కేంద్రాలు ఏర్పాటు చేసిన్నట్లు మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక వంటి పథకాలు పొందడానికి తప్పనిసరిగా పల్స్ సర్వే లో ఉండాలని, ఇందుకు ఈ నెలాఖరు వరకు కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెల్లరేషన్ కార్డు గల వారు ఈ పల్స్ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.







