గంగవరం (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు బుధవారం మండల స్థాయి అధికారులు గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. తాహశీల్దార్ శ్రీమన్నారాయణ గంగవరం ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను, వంటశాల, మరుగుదొడ్ల పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం తయారు చేసిన భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వేములోవ ఆశ్రమ ఉన్నత పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి మల్లేశ్వరరావు తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్.వి.వి సత్యనారాయణ, వసతి గృహా సంక్షేమ అధికారులు ఎం. శ్రీనివాసరావు, సీతారత్నం తదితరులు ఉన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







