ఆశ్రమ పాఠశాల తనిఖీ

గంగవరం (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను శుక్రవారం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఇన్చార్జ్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం. ముక్కంటి తనిఖీ చేశారు. పాఠశాలలోని పలు విభాగాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం చదువు, అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. విద్యార్థుల కోసం సిద్ధం చేసిన వంటకాలను రుచి చూశారు. అలాగే మరుగుదొడ్ల శుభ్రత పరిసరాల పరిశుభ్రత పై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట తాహశీల్దార్ శ్రీమన్నారాయణ, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ అనూష, సహాయ గిరిజన సంక్షేమ అధికారి హాసిని, ఆర్ఐ జిలాని తదితరులు ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us