UPDATED 26th DECEMBER 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోటలోని విబిఆర్ఐ ఎదురుగా ఉన్న బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులకు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. వేట్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ సి.హెచ్. ధనలక్ష్మి సుమారు 60 మంది బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కె. రత్నకుమారి, పి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.







