UPDATED 26th DECEMBER 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక మాధవపట్నం రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు. మృతుని వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు ఉండి, 5.6 ఎత్తుతో తెలుపు రంగులో ఉన్నాడని, మృతదేహం ఉన్న స్థితిని బట్టి ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్ తెలిపారు.







