గంగవరం (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022: పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు పదవులు దక్కుతాయని ఎంపీపీ కృష్ణారెడ్డి జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం, వైసీపీ మండల ఇన్చార్జి రఘునాథ్ అన్నారు. మంగళవారం గంగవరం ఎంపీటీసీ సభ్యురాలు గంగాదేవి రెండవ వైస్ ఎంపీపీగా ఎంపిక కావడంతో ఆమెకు వైసీపీ నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, ఎమ్మెల్యే ధనలక్ష్మి సహకారంతో మండలం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామ తులసి, కో-ఆప్షన్ సభ్యులు కళ్లెం ప్రభాకర్, వైస్సార్సీపీ రైతు విభాగం కార్యదర్శి వైయస్ ప్రసాద్, ఎంపీటీసీలు మద్దిటి వెంకటలక్ష్మి, కోటికలపూడి రామతులసి, పద్మావతి, మండల నాయకులు బూరకట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







